Thursday, March 28, 2024

ఏపీలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు…కొత్తగా 8766 కేసులు

ఏపీలో క‌రోనా కేసుల మరోసారి పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన 24గంట‌ల్లో కొత్తగా 93,511మందికి పరీక్ష‌లు చేయ‌గా… 8766 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే చికిత్స పొందుతూ కొత్తగా గడిచిన 24 గంటల్లో 68మంది మృతి చెందారు. మరోవైపు 12,292మంది క‌రోనా నుంచి కొలుకున్నారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 11,969మంది మృతి చెందగా 1,03,995యాక్టివ్ కేసులున్నాయి. అలాగే మొత్తం కేసుల సంఖ్య 17,79,773కి చేరింది. అలాగే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 16,64,082కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement