Thursday, April 25, 2024

తగ్గేదే లే…24 గంటల్లో 24 వేల కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి అదే స్థాయిలో ముందుకు వెళ్తుంది. గడిచిన గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 24,492 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.మరోవైపు ఈ మహమ్మారి బారిన పడి దేశ వ్యాప్తంగా 131 మంది మరణించారు. అలాగే గడిచిన 24 గంటల్లో 20,191 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

కాగా తాజాగా నమోదు అయిన కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదు అయిన కేసుల సంఖ్య 1,14,09,831 చేరింది. 1,10,27,543 మంది కోరుకున్నారు. ప్రస్తుతం 2,23,432 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే ఇప్పటివరకు 1,58,856 మంది కరోనా కారణంగా మృతి చెందారు. అయితే కరోనా కేసులు మళ్లీ దేశంలో పెరుగుతున్న దృష్ట్యా బుధవారం ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement