Thursday, April 25, 2024

మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా… 20 వేలు దాటిన పాజిటివ్ కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి 20 వేలు దాటాయి. గత కొన్ని రోజులు 20 వేలలోపే నమోదవుతుండగా, నేడు కొత్తగా 20,551 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,41,07,588కి చేరాయి. ఇందులో 4,34,45,624 మంది బాధితులో వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,600 మంది మరణించారు. మరో 1,35,364 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కరోనాతో 70 మంది మరణించగా, 21,595 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement