Friday, April 19, 2024

బీటౌన్‌లో కరోనా కలకలం

టాలీవుడ్ ను కరోనా కంగారు పడుతుంది. ఇప్పటికే బాలీవుడ్‌ నటీనటులు ఆలియాభట్‌, రణ్‌బీర్‌కపూర్‌, మాధవన్‌, ఆమిర్‌ఖాన్‌, పరేష్‌ రావల్‌, కార్తిక్‌ ఆర్యన్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌లు కొవిడ్‌-19 బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం బాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్ తనకు కరోనా సోకిందని ట్విట్టర్లో తెలిపారు. ఆయన వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు. తనను కాంటాక్ట్ అయిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు అక్షయ్ కుమార్.‌ తాజాగా నటుడు గోవింద కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన సతీమణి సునీత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. గోవింద ఆరోగ్య పరిస్థితి కూడా స్థిరంగానే ఉన్నట్లు బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, సంజయ్‌ దత్‌, మలైకా అరోరా వంటి స్టార్లు ఇప్పటికే కరోనా టీకా తీసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement