Friday, March 29, 2024

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు…కొత్తగా 4872కేసులు

ఏపీలో కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 64,800 సాంపిల్స్ ని పరీక్షించగా 4,872 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. అలాగే ఈ మహమ్మారి కారణంగా చిత్తూర్ లో పదమూడు మంది, గుంటూరు లో పది, అనంతపూర్ లో తొమ్మిది, శ్రీకాకుళం లో తొమ్మిది, విజయనగరం లో ఏడుగురు, పశ్చిమ గోదావరి లో ఏడుగురు, ప్రకాశం లో ఆరుగురు, విశాఖపట్నం లో ఆరుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు మరియు నెల్లూరు లో నలుగురు మరణించారు.

గడచిన 24 గంటల్లో 13,702 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. కాగా నేటి వరకు రాష్ట్రంలో 1,98,56,521 సాంపిల్స్ ని పరీక్షించారు.

తాజా గణాంకాల ప్రకారం….రాష్ట్రంలో మొత్తం కేసులు 1763211
మొత్తం యాక్టీవ్ కేసులు…114510
డిశ్చార్జ్ అయినవారు…1637149
మొత్తం మృతి చెందిన వారి సంఖ్య…11552

Advertisement

తాజా వార్తలు

Advertisement