Friday, April 26, 2024

ఇండియాలో తగ్గుతున్న కరోనా….కొత్తగా ఎన్ని కేసులో తెలుసా ?

ఇండియాలో కరోనా కేసులు తగ్గుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332కేసులు నమోదు అయ్యాయి. అలాగే చికిత్స పొందుతూ 4002 మంది మృతి చెందారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 1,21,311మంది క‌రోనా నుంచి కొలుకున్నారు.

కాగా తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసులు సంఖ్య 2,93,59,155కి చేరింది. అలాగే కోలుకున్న వారి సంఖ్య‌ 2,79,11,384 కి చేరింది. ఇక దేశంలో మొత్తం మహమ్మారి కారణంగా 3,67,081మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 10,80,690 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

కొత్త‌గా వ‌చ్చిన కేసుల్లో అత్య‌ధికంగా త‌మిళ‌నాడులో 15,759, కేర‌ళ‌లో 14,233, మ‌హారాష్ట్ర 11,766, క‌ర్ణాట‌క 8,249, ఏపీలో 8,239 కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement