Saturday, April 20, 2024

దేశంలో అదే స్థాయిలో కరోనా కేసులు…కొత్తగా 1,32,788

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,32,788మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే 2,31,456మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరోవైపు చికిత్స పొందుతూ 3207మంది మృతి చెందారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల పాజిటివ్ కేసుల సంఖ్య‌ 2,83,07,832కి చేరింది. అలాగే
2,61,79,085 మంది కరోనా నుంచి కొలుకున్నారు. మరోవైపు 3,35,102 మంది ఈ మహమ్మారికి బలి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 17,93,645 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement