Tuesday, April 23, 2024

పెరుగుతున్న కరోనా యాక్టివ్‌ కేసులు.. కొత్తగా మరో 705 కరోనా పాజిటివ్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 705 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులను కలుపుకుంటే తెలంగాణలో ఇప్పటి వరకు నమోదై న మొత్తం కరోనా కేసుల సంఖ్య 8, 19, 846కు చేరింది. కరోనా నుంచి కోలుకోవడంతో 531 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 5543కు చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 32, 834మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో 355, కరీంనగర్‌లో 42, ఖమ్మం 21, మేడ్చల్‌ మల్కాజిగిరి 35, రంగారెడ్డి 48, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో 29 అత్యధిక కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement