Thursday, April 25, 2024

బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలపై వివాదం

ఈరోజు హిందూపూరం ఎమ్మెల్యే , టాలీవుడ్‌ స్టార్‌ హీరో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు. దీంతో టీడీపీ నేతలతో పాటు హిందూపురంలో కోలాహలం నెలకొంది. అటు గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ యూనివర్సిటీ వద్ద బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు కేక్ కట్ చేశారు.

ఈ నేపథ్యంలోనే కరోనా ఆంక్షలు ఉన్నాయంటూ పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. అయినా విద్యార్థులు… పోలీసులకు ఆంక్షలను పట్టించుకోలేదు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చేలరేగింది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అయితే ఈ ఘటనపై టీడీపీ పార్టీ సీరియస్‌ అయింది. విద్యార్థుల మీద లాఠీఛార్జ్ చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్‌ నేతృత్వంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ఈ వార్త కూడా చదవండి: దసరా బరిలో సినిమాలే సినిమాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement