Friday, April 19, 2024

హైకోర్టు వ‌ద్ద కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌..

దేశ రాజ‌ధాని ఢిల్లీ హైకోర్టు వ‌ద్ద ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య కలకలం రేపుతోంది. బుధ‌వారం ఉద‌యం 10:15 గంట‌ల‌కు గేట్ నంబ‌ర్ -3 వ‌ద్ద కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న కానిస్టేబుల్‌ని రాజ‌స్థాన్ బెటాలియ‌న్‌కు చెందిన టింకూరామ్‌గా పోలీసులు గుర్తించారు. సెల‌వుల త‌ర్వాత కానిస్టేబుల్ టింకూరామ్ ఈ రోజే విధుల్లో చేరాడు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే టింకూరామ్ ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఇది కూడా చదవండి: “పుష్ప ది రైజ్”: శ్రీవల్లిగా రష్మిక లుక్ అదుర్స్..

Advertisement

తాజా వార్తలు

Advertisement