Friday, March 29, 2024

గన్ మిస్‌ఫైర్.. ఏఆర్ కానిస్టేబుల్ మృతి

తిరుపతిలో గన్ మిస్‌ఫైర్ కావడంతో ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణరెడ్డి మృతిచెందాడు. తిరుపతి సబ్ జైలు వాచ్ గార్డు రూం వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. రిలీవర్ సిద్ధారెడ్డి రావడంతో లక్ష్మీనారాయణరెడ్డి బట్టలు మార్చుకునే క్రమంలో ఈ మిస్‌ఫైర్ జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తుపాకీ శబ్దం రావడంతో కుప్పకూలిన లక్ష్మీనారాయణరెడ్డిని చూసి సిద్ధారెడ్డి స్థానికుల సహాయంతో అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా ఈ ఘటనపై తిరుపతి వెస్ట్ సీఐ శివప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement