కాంగ్రెస్ పీఏసీ మీటింగ్ లో రచ్చ నెలకొంది. ఈ సమావేశం నుండి సీనియర్ నేత జానారెడ్డి బయటకి వెళ్ళిపోయారు. హుజురాబాద్ ఓటమిపై చర్చల విషయంలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వినిపించాయి. జానారెడ్డి మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోయారు. రాకపోతే రాలేదని అంటారనే వచ్చానని వ్యాఖ్యినించడం విశేషం. అంతేకాదు హుజురాబాద్ ఎన్నికలపై నో కామెంట్ అని అన్నారు. మరో సీనియర్ నేత పీఏసీ సమీక్షలో వీహెచ్ హాట్ కామెంట్స్ ని చేశారు. స్టార్ క్యాంపైనర్స్ ఎంతమంది ఉన్నారు. ప్రచారానికి ఎంతమంది వెళ్ళారని వీహెచ్ ప్రశ్నించారు. అంతేకాదు ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేశారని ఆయన సెటర్లు విసిరారు. ఇలా కాంగ్రెస్ పీఏసీ మీటింగ్ రసాభాసగా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement