Saturday, April 20, 2024

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. తాను కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా ఎంపీ రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. డాక్టర్ల సలహాతో ఐసోలేషన్‌కు వెళ్లానని తెలిపారు. గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు.

మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ వాడి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement