Thursday, March 28, 2024

సీఎం కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ.. ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరిక

రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు.రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను చిన్నచూపు చూడడం తగదని లేఖలో అన్నారు. రైతులపై కుటిల ప్రేమ చూపడం మానుకోవాలని హితవు పలికారు. ఈ సీజన్లో రైతులు నాట్లు వేయడం ప్రారంభించినా… ధాన్యం బకాయిల బిల్లులు చెల్లించకపోవడం ఏంటని ప్రశ్నించారు. బకాయిలు అందక లక్షమంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు రూ.600 కోట్లు చెల్లించాలని, లేదంటే ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement