Friday, April 19, 2024

కేసీఆర్‌కు పిండ ప్రదానం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ నేతలు పిండ ప్రదానం చేసి నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేళ్లు గడిచిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దీంతో స్థానిక గాంధీ చౌక్‌లో కేసీఆర్ చిత్రపటానికి పిండ ప్రదానం నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గాంధీ చౌక్‌కు చేరుకుని కాంగ్రెస్ పార్టీ నేతలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకన్న మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ వస్తే ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు విద్య, వైద్యం అందుబాటులో ఉండేదన్నారు. అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసి ఒక్క కరీంనగర్ జిల్లాకు ఇవ్వకపోవడం కారణమేంటని ప్రశ్నించారు. ఐదేళ్ల కిందట ఇదే అంశంపై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ దీక్ష చేస్తే.. కేసీఆర్ తన అధికార బలంతో దీక్షను భగ్నం చేయించారని గుర్తుచేశారు.

ఈ వార్త కూడా చదవండి: పథకాలకు డబ్బులు లేవు.. మరి మేఘ ప్రాజెక్టుకు ఎలా?

Advertisement

తాజా వార్తలు

Advertisement