Wednesday, April 24, 2024

బీజేపీ నేతలకు టీకాకు, మందుకు తేడా తెలియదా?

ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి పెట్టిన ఓ ట్వీట్‌పై ఏపీ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ సెటైర్లు వేశారు. సదరు ట్వీట్‌లో రెమిడెసివిర్ మందును విష్ణువర్ధన్‌రెడ్డి టీకాగా చెప్పడంపై ఆమె మండిపడ్డారు. ‘ముందు టీకాకు, మందుకు తేడా తెలుసుకుని రండిరా బాబూ’ అంటూ ఘాటుగా బదులిచ్చారు. బాధల్లో ఉన్న ప్రజలను నవ్వించడానికి బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు అమోఘం అంటూ ఎద్దేవా చేశారు. కాగా రెమిడిసివర్ టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు కేంద్రం పెంచిందంటూ విష్ణువర్ధన్‌రెడ్డి ఓ పోస్టర్‌ ప్రచురించడంతో ఈ వివాదం తలెత్తింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement