Wednesday, April 24, 2024

కోమటిరెడ్డి వెంకటరెడ్డి సర్వే: ఈటల గెలుపు ఖాయమట..

హుజూరాబాద్‌ బై ఎలక్షన్ల లో బీజేపీ విజయం ఖాయమని తేల్చి చెప్పారు కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. హుజురాబాద్ ఉప ఎన్నికలలో బీజేపీ నేత ఈటల రాజేంధర్ పక్కాగా గెలుస్తారని..తాను చేయించిన సర్వేలో ఈ విషయం తేలిందని ఆయన అన్నారు..ఇక్కడ కాంగ్రెస్‌కు ఐదు శాతానికి మించి ఓట్లు వచ్చే అవకాశం లేదన్నారు. ఈటలకు 67 శాతం, టీఆర్ఎస్‌కు 30 శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తే కొంత మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. నల్గొండ, భువనగిరి లోక్‌సభ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాల్లోనూ కాంగ్రెస్‌ను గెలిపించడమే తన లక్ష్యమని వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో పాలన కేటీఆర్ మిత్రుడు, ఆర్థిక కుంభకోణాలకు పాల్పడి ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించిన సత్యం రామలింగరాజు కుమారుడు తేజరాజు చేతిలో ఉందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయం: కొడాలి నాని

Advertisement

తాజా వార్తలు

Advertisement