Tuesday, April 16, 2024

‘గులాబీ’ తోటలో గంజాయి వనాలు ఉన్నాయి

బెంగళూరు డ్రగ్స్ కేసులో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ స్పందించారు. గులాబీ తోటలో గంజాయి వనాలు పెంచుతున్న పరిస్థితి కనబడుతుందని, డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు బయటకు వస్తుంటే ఎందుకు ఎవరూ మాట్లాడంలేదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయని, ఈ విషయంపై విచారణ జరిపించాలని కోరారు. గతంలో సినీ నటులపై పెద్ద ఎత్తున దాడులు చేసి తర్వాత డ్రగ్స్ కేసును పోలీసులు నీరుగార్చారని, ఇప్పుడైనా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement