Thursday, April 25, 2024

దేశం కోసం కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసింది : సీఎల్పీ నేత బ‌ట్టి

దేశం కోసం కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసిందని, గాంధీని చంపిన గాడ్సే భావజాలం కలిగింది బీజేపీ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ పాల‌న‌లో ఎంతో మంది ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని, మోదీ పాలనలో దేశ ప్రజల దుస్థితిని తెలియచెప్పేందుకే రాహుల్ భారత్ జోడోయాత్ర చేప‌ట్టార‌న్నారు. ఈ పాద‌యాత్ర‌లో ఎంతో మంది రాజ‌కీయ నేత‌లు, సినీ ప్ర‌ముఖులు రాహుల్ గాంధీతో క‌లిసి పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నార‌న్నారు. రాహుల్ ఆశ‌యాల‌ను గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తీసుకెళ్లాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు. 2003 వైఎస్సార్ పాదయాత్ర ఒక సంచలనమని… నాడు ఇందిరమ్మ రాజ్యం తెస్తానని వైఎస్సార్ బయలుదేరారని గుర్తు చేశారు. వైఎస్సార్ పాదయాత్రతో సమూల మార్పులు తీసుకొచ్చారన్నారు. ఎంతోమంది వైఎస్సార్ పాదయాత్రలో భాగస్వామ్యమయ్యామని భట్టి విక్రమార్క తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement