Monday, April 15, 2024

Confident – మ‌ధ్య‌ప్ర‌దేశ్ అధికార పీఠం మాదే – రాహుల్ గాంధీ..

న్యూఢిల్లీ – త్వరలో జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో 136 సీట్లు గెలిచామని, మధ్యప్రదేశ్ లో 150 సీట్లు గెలుస్తామని చెప్పారు. మధ్యప్రదేశ్ కు చెందిన పార్టీ కీలక నేతలు ఈరోజు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో భేటీ అయ్యాయి. భేటీ అయిన వారిలో మధ్యప్రదేశ్ పార్టీ చీఫ్ కమల్ నాథ్ కూడా ఉన్నారు. అనంత‌రం రాహుల్ మాట్లాడుతూ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో బిజెపి ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని అన్నారు.. దేశ వ్యాప్తంగా బిజెపి ఎదురుగాలు వీస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు.. బిజెపి పాల‌న‌లో ఏ ఒక్క వ‌ర్గం సంతోషంగా లేర‌ని క‌ర్నాట‌క ఎన్నిక‌ల‌లో బిజెపి ఓట‌మి తేట‌తెల్లం చేసింద‌న్నారు.. అలాగే కమల్ నాథ్ మాట్లాడుతూ ఎన్నికలకు 4 నెలల సమయం మాత్రమే ఉందని చెప్పారు. మధ్యప్రదేశ్ భవిష్యత్తు, ప్రధాన సమస్యలపై సమావేశంలో చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌టిష్టంగా ఉంద‌ని , ఈసారి అధికారం కాంగ్రెస్ దేన‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement