Thursday, April 25, 2024

ఆదిపురుష్ టీంపై.. స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ స‌మితి కంప్లైంట్

తిరుమ‌ల‌లో హీరోయిన్ కృతిస‌న‌న్ ని ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ముద్దు పెట్ట‌డంతో వివాదం చెల‌రేగింది. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి పనులేంటని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై సనాతన ధర్మ పరిరక్షణ సమితి తిరుపతి ఎస్వీయూ క్యాంపస్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని, వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సమితి సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై చిలుకూరు దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్‌ కూడా మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత భానుప్రకాష్ డిమాండ్‌ చేశారు. సినిమా రంగంలో పెక్, ఫ్లయింగ్ కిస్ ఇస్తూ బైబై చెప్పడం సాధారణమే కావచ్చు కానీ తిరుమల వంటి పుణ్య క్షేత్రంలో ఇలా చేయడం సరైన పద్ధతి కాదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ కు భక్తి శ్రద్ధలు ఎక్కువేనని, ఆయన ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చని ఆయన టీమ్‌ చెబుతున్నారు. ఐతే తిరుమల క్షేత్రంలో ఆ విధంగా చేయడం భక్తుల ఆగ్రహానికి గురి అవుతోంది. దీనిపై ఆయన స్పందించాలని కొందరు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement