Monday, March 25, 2024

గ్యాస్ వినియోగదారులకు షాక్.. పెరిగిన సిలిండర్ల ధర..

గ్యాస్ వినియోగదారులకు చమరు సంస్థలు షాకిచ్చాయి. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను బుధవారం రూ.103.50 పెంచారు. పెరిగిన ధర ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,174కి చేరింది. ఇక, హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,278కు చేరింది. ముంబైలో వాణిజ్య గ్యాస్ ధర రూ.2,051కి పెరిగింది. ఇక చెన్నైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,234.50కి చేరుకుంది.

కాగా, గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రం చమరు సంస్థలు ధరలు పెంచలేదు. డొమెస్టిక్ సిలిండర్ల ధరను కంపెనీలు పెంచకపోవడంతో ప్రజలకు స్వల్ప ఊరట కలిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement