Friday, April 19, 2024

మంత్రి ఎర్రబెల్లిని కలిసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్

హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సిక్తా పట్నాయక్ మంగ‌ళ‌వారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ కి మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ జిల్లా సమస్యలు – పరిష్కారాలపై మంత్రి వివరించారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్ గా పనిచేసిన అనుభవంతో హనుమకొండ జిల్లా కలెక్టర్ గా మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెంచాలని, నాయకులు – అధికారులతో సమన్వయం చేసుకుని వెళ్లాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement