Friday, April 19, 2024

వ‌ర‌ద నీరుకి కుప్ప కూలిన బ్రిడ్జ్‌..రాక‌పోక‌లు బంద్..

వెలిగ‌ల్లు జ‌లాశ‌యం నాలుగు గేట్లు ఎత్తివేశారు..దాంతో వ‌ర‌ద నీరు ఉప్పొంగిపోయింది. నీరు అంచుల వ‌ర‌కు చేర‌డంతో నానిపోయిన పాపాగ్ని న‌ది వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ బ్రిడ్జి అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారిపై ఉండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లిస్తున్నారు. రాకపోకలు పునరుద్ధరించేందుకు నెల రోజులకుపైగా పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement