Saturday, April 20, 2024

తెలంగాణపై చలి పంజా.. పడిపోతున్న ఉష్టోగ్రతలు..

తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. హైదరాబాద్ లో సైతం చలి వణికిస్తోంది. పగటి వేళల్లో వేడిగా ఉంటున్నప్పటికీ… రాత్రి పూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. ఉదయం పూట మంచు కూడా కురుస్తోంది. చలి తట్టుకోలేక ప్రజలు వణికిపోతున్నారు. అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదయిందని వాతావరణ శాఖ తెలిసింది. కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ లో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. మంచిర్యాల జిల్లాలో 9.9, ఆదిలాబాద్ జిల్లాలో 10.5, నిర్మల్ జిల్లాలో 10.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో అత్యల్పంగా 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోనూ క్రమంగా చలితీవ్రత పెరుగుతుండటంతో నగరవాసులు వణికిపోతున్నారు. మరోవైపు ఏపీలో సైతం చలి ప్రతాపం చూపుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, మినుములూరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. అరకులో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement