Friday, April 19, 2024

క‌రోనాపై అప్ర‌మ‌త్త‌మ‌యిన సీఎం స్టాలిన్.. ఆరోగ్య మంత్రి..అధికారుల‌తో స‌మావేశం

నేడు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్ర ఆరోగ్య‌మంత్రి ఎంఏ సుబ్ర‌మ‌ణియ‌న్, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని సెక్రటేరియట్‌లో ఈ సమావేశం జరిగింది. కరోనా నియమ నిబంధనలు, మహమ్మారి కట్టడికి రాష్ట్రంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అందరూ మాస్కులు ధరించడం, శానిటైజర్‌ వినియోగించడం, సామాజిక దూరం పాటించడం లాంటి ప్రధాన కొవిడ్ నియమాలను తప్పనిసరి చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement