Friday, March 29, 2024

కొత్త ఏడాదిలో రాష్ట్రం, దేశం గొప్పగా అభివృద్ధి చెందాలి.. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు

హెదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ శోభకృత్‌ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొన్నదని తెలిపారు.

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టమైందన సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిల్చిందన్నారు. శోభకృత్‌ నామ సంవత్సరంలో తెలంగాణతోపాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement