Friday, April 19, 2024

నెలవంక దర్శనంతో రంజాన్‌ మాసం ఆరంభం.. దేశ, రాష్ట్ర ముస్లింలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నెలవంక దర్శనంతో ప్రారంభమైన పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్‌ తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. పరమ పవిత్రమైన రంజాన్‌ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనను పెంపొందించి, ఆదర్శవంతమైన జీవితం దిశగా ప్రేరణనిస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

రాన్‌ ఉద్బవించిన పరమ పవిత్ర మాసంగా భావించే రంజాన్‌ మాసంలో ఖురాన్‌ పఠనం, ప్రార్ధనలు, ఉపవాస దీక్షలు, జకాత్‌, ఫిత్రా వంటి ధార్మిక కార్యక్రమాలతో ఆధ్యాత్మికత, జీవిత పరమార్ధం అవగాహనలోకి వస్తాయని చెప్పారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement