Thursday, April 25, 2024

ఈ నెల 23న సిఎం కెసిఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన.. పంట నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన

కరీంనగర్, (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 23న కరీంనగర్ జిల్లాలో పర్యించనున్నారు. ఇటీవల కురిసిన వడగళ్ల వాన తో జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలోని ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీ పూర్ గ్రామాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది.

సీఎం కేసీఆర్ స్వయంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. సీఎం రాక కోసం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ వద్ద హెలిఫ్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. బందోబస్తు ఏర్పాట్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement