Wednesday, April 24, 2024

రేపు మహబూబాబాద్ కు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మహబూబాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 11గంటలకు హెలికాప్టర్ లో మహబూబాబాద్ చేరుకుంటారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి.., పార్టీ పతకాన్ని ఎగురవేసి, భారత రాష్ట్రసమితి జిల్లాపార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంబిస్తారు. బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కలవనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సులో బయలుదేరి రోడ్డుమార్గం ద్వారా ప్రయాణం చేసి మహబూబాబాద్ పట్టణాన్ని చూస్తూ నూతన సమీకృత కలెక్టరేట్ భవనానికి చేరుకుంటారు. అయితే సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement