Tuesday, April 23, 2024

సీఏం కేసీఆర్ కు రాఖీ కట్టిన తోబుట్టువులు..

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆయన అక్క చెల్లెలు రాఖీ కట్టారు. అక్కాచెల్లెళ్లు ల‌క్ష్మ‌మ్మ‌, జ‌య‌మ్మ‌, ల‌లిత‌మ్మ ముగ్గురు క‌లిసి కేసీఆర్‌కు హార‌తి ప‌ట్టి, రాఖీలు క‌ట్టి, మిఠాయిలు తినిపించి ఆశీర్వ‌దించారు. సీఎం మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కు సోదరి అలేఖ్య రాఖీ కట్టింది. ఈ రాఖీ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీంతో ప్రగతిభవన్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రజలందరికీ కేసీఆర్ రాఖి పర్వదినాన శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి: వాహనదారులకు ఊరట… తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Advertisement

తాజా వార్తలు

Advertisement