Thursday, April 25, 2024

థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నల్లగొండ జిల్లా దామరచర్లలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దామరచర్లలో నిర్మితమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ప్లాంటు వద్దకు చేరుకున్న సీఎం అక్కడ ప్లాంట్‌ నిర్మాణపనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రూ.29,965 కోట్లతో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే 5 యూనిట్లను సీఎం పరిశీలిస్తున్నారు. అనంతరం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ప్లాంట్‌ పనుల పురోగతిని ఏరియల్‌ వ్యూ ద్వారా సీఎం పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement