Thursday, April 25, 2024

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

మ‌హ‌బూబ్ న‌గ‌రంలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. జిల్లా కేంద్రానికి స‌మీపంలో పాల‌కొండ వ‌ద్ద నిర్మించిన సమీతకృత కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. చాంబర్‌లో కలెక్టర్‌ వెంకట్రావ్‌ను సీట్‌లో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన ప‌లువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు. టీఆర్ ఎస్ కార్యాల‌యం వ‌ద్ద పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్క‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement