Thursday, April 25, 2024

టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ నామినేషన్

టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ తరఫున మంత్రులు నామినేషన్‌ సమర్పించారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ తరఫున పార్టీ అధ్యక్ష పదవికి మంత్రులు నిరంజన్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీష్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్‌ కుమార్‌, మల్లారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ నామినేషన్‌ దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ను మంత్రి మహమూద్‌ అలీ ప్రతిపాదించగా.. మంత్రులు బలపరిచారు.

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్‌ను ఆదివారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. ఈనెల 23న ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన, 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 25 హైటెక్స్‌లో నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీలో అధ్యక్ష ఎన్నిక జరగనుంది.

ఇది కూడా చదవండి: నాలుగు ఓట్ల కోసం.. ఝూటా మాటలొద్దు

Advertisement

తాజా వార్తలు

Advertisement