Thursday, April 25, 2024

Telangana | విజయరామారావు మృతికి, సీఎం కేసీఆర్​ సంతాపం.. అధికారక లాంఛనాలతో అంత్యక్రియలు

సీబీఐ మాజీ డైరెక్టర్, ఉమ్మడి ఏపీలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన కె.విజయరామారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా విజయరామారావు అందించిన ప్రజా సేవలు గొప్పవని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, అనంతరం తెలంగాణ రాష్ట్రంలో విజయరామారావుతో తనకున్నఅనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు.

విజయరామారావు ఆత్మకు శాంతి చేకూరాలని సిఎం కేసీఆర్​ ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగతులైన మాజీ మంత్రి విజయరామారావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సిఎం కేసీఆర్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement