Tuesday, April 23, 2024

రేపు, ఎల్లుండి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

పెళ్లి రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి సిమ్లా వెళ్లిన ఏపీ సీఎం జగన్ తన వ్యక్తిగత పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప బయలుదేరనున్న సీఎం సాయంత్రం 4:50 గంటలకు ఇడుపులపాయ చేరుకోనున్నారు. అక్కడ పార్టీ నాయకులతో మాట్లాడి, వైఎస్‌ఆర్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేయనున్నారు.

సెప్టెంబర్ 2న దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఉదయం 9:30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్నారు. అనంతరం పార్టీ నాయకులతో మాట్లాడి తాడేపల్లికి తిరుగుపయనం కానున్నారు. ఉదయం 11:30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి మ.12:45 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.

ఈ వార్త కూడా చదవండి: జలశక్తి శాఖ మంత్రిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

Advertisement

తాజా వార్తలు

Advertisement