Friday, April 19, 2024

రోడ్డు ప్రమాదంపై సీఎం ఆరా

విజయనగరం జిల్లాలోని సుంకరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ ఆరా తీశారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారు ప్రమాదానికి గురైనట్టుగా అధికారులు సీఎంకు తెలిపారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

కాగా, విజయనగరం జిల్లా సుంకరిపేట వద్ద సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుంకరిపేట వద్ద రెండు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు, లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గ్యాస్‌ సిలిండర్ల లారీ, 2 ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 28 మందికి గాయాలయ్యాయి.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement