Thursday, March 28, 2024

విద్యార్థులకు సీఎం భరోసా ..హై స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణానికి 25 లక్షలు ..

బుచ్చిరెడ్డిపాలెం ప్రభ న్యూస్ : వరదలకు పూర్తిస్థాయిలో దెబ్బతిన్న పెనుబల్లి హై స్కూల్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో గ్యాలరీ ద్వారా పరిశీలించారు. ఆయన వరద బాధితులను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన సరదాగా ముచ్చటించారు. పిల్లలు బాగా చదువుకోండి కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హై స్కూల్ వరదలకు దెబ్బతిందని తన దృష్టికి తీసుకు వచ్చారన్నారు అన్నారు . విద్యార్థులు చదువులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు తన వంతు సాయం అందిస్తున్నా అంటూ విద్యార్థులకు ఆప్యాయంగా తెలిపారు .పాఠశాల ఆధునికీకరణకు 25 లక్షలు ఇస్తున్నాం అంటూ భరోసా ఇచ్చారు. విద్యార్థులతో సెల్ఫీ దిగి అందర్నీ ఆశ్చర్యపరిచారు. విద్యార్థుల సమస్యలపై వినతి పత్రం ఇచ్చిన వారిలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి రావు, సూరా శ్రీనివాసులు రెడ్డి, హెడ్మాస్టర్ వెంకటరత్నం పరమేశ్వరరావు వెంకట్ రెడ్డి, సిరాజ్ అహ్మద్, ఉపాధ్యాయులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement