Friday, April 19, 2024

Kadapa : తొమ్మిదవ తరగతి విద్యార్థిని ప్రసవం..

తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ బాలిక ప్రసవించిన సంఘటన శనివారం కడప జిల్లా వాల్మీకిపురంలో జరిగింది. స్థానికంగా ఉన్న పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ బాలికకు కడుపునొప్పి తాళలేక ఇబ్బంది ప‌డింది. ఇది గ‌మ‌నించిన పాఠశాల సిబ్బంది బాలికను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలో ఆమె గర్భవతి అని నిర్ధారించారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే సదరు బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విష‌యం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం వెంట‌నే ఆస్ప‌త్రికి వెళ్లారు. స్థానిక ఎస్‌ఐ బిందుమాధవి, తహసీల్దార్‌ ఫిరోజ్‌ఖాన్‌లు విచారణ చేపట్టారు. ఈ సంఘటన పట్టణంలో చర్చనీయంగా మారింది. ఆమెను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించారు. మరోవైపు బాధితురాలు గర్భం దాల్చడానికి ఆమె మేనమామే కారణం అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement