Thursday, April 25, 2024

మాస్క్ పోడు & ఓటు పోడు

తమిళనాట పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కునువినియోగించుకుంటున్నారు.కాగా ఈ నేపథ్యంలోనే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రముఖులు కూడా సామాన్య ప్రజల తోని క్యూలో నిలబడి ఓటింగ్ లో పాల్గొనడం విశేషం. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ ,కమల్ హాసన్, కూతురు శృతిహాసన్, అక్షర హాసన్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో స్టెల్లా మేరీస్ పోలింగ్ బూతులో రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక చెన్నై స్కూల్లో కమల్ హాసన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.మరోవైపు స్టార్ హీరో అజిత్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కే.జీ రో సూర్య కార్తీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారంతా కూడా సామాన్య ప్రజలతో క్యూలైన్ లో నిలుచుని మాస్క్ పెట్టుకుని అజిత్ కనిపించారు. ప్రస్తుతం సెలబ్రిటీలకు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మాస్క్ పోడు & ఓటు పోడు అంటూ అభిమానులు సైతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement