Thursday, April 25, 2024

మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎం జగన్ మాటలను వక్రీకరించిన కేసులో కర్నూలు సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని పేర్కొంది. ఏప్రిల్ 7న మీడియా సమావేశం నిర్వహించిన ఉమ.. సీఎం జగన్ వీడియోలను మార్ఫింగ్ చేసి ప్రదర్శించారని జగన్ తరపు న్యాయవాది సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు, కర్నూలు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు 464, 465, 468, 469, 470, 471, 505, 120 (బి) సెక్షన్‌ల కింద దేవినేని ఉమాపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన వీడియోలు కూడా తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement