Sunday, March 24, 2024

గుంటూరు జిల్లాలో కలకలం.. ఎస్సై, కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లాలోని చుండూరు పోలీస్‌స్టేషన్‌ ఎస్సై శ్రావణి, అదే పీఎస్‌లోని పనిచేస్తూ ఒకరోజు ముందు వీఆర్‌లోకి వెళ్లిన కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. శ్రావణి గత ఏడాది అక్టోబరులో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. రవీంద్ర ఐదేళ్ల నుంచి ఇక్కడే కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఎస్సై శ్రావణితో సన్నిహితంగా మెలిగేవాడని తెలిసింది. అయితే ఏమైందో తెలియదు కానీ వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఈ విషయంపై చుండూరు సీఐ రమేష్‌బాబును వివరణ కోరగా ఎస్సై శనివారం స్టేషన్‌కు రాలేదని, వారిద్దరు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారనే విషయం తెలియదని చెప్పారు. అయితే వారిద్దరే కారులో వెళ్లి ముందుగా తెనాలిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేరారని పేర్కొన్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం 108 ద్వారా గుంటూరులోని వేర్వేరు ప్రైవేటు వైద్యశాలలకు తరలించినట్టు చెప్పారు. వారు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని, సాధారణ స్థితిలోకి వచ్చిన తరవాత వివరాలు తెలియజేస్తామని సమాధానమిచ్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement