Wednesday, April 24, 2024

ఛ‌లో ఖ‌మ్మం.. కాన్వాయ్ విడిచి.. లారీ ఎక్కిన మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి (వీడియోతో..)

సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాన్వాయ్ విడిచి.. లారీ ఎక్కారు. సూర్యాపేట రూరల్ మండలం సోలీపేట గ్రామం నుండి కార్యకర్తలతో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి లారీలో ఖమ్మం బహిరంగ సభకు బయలు దేరారు. ఖ‌మ్మం జిల్లాలో బీఆర్ఎస్ భారీ బ‌హిరంగ స‌భకు రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తున్నారు. ఇందులో భాగంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ నాయ‌కులు జ‌న‌స‌మీక‌ర‌ణ చేసి వారితో పాటు ఖ‌మ్మం బ‌య‌లుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement