Thursday, April 18, 2024

చిత్తూరు జిల్లా..జర్రివారిపల్లిలో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా జర్రివారిపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్కూల్ కు తాళంవేసి విద్యార్థులు, గ్రామస్థులు ధర్నాకు దిగారు. తమ స్కూల్ ను జడ్పీ హైస్కూల్లో విలీనం చేయొద్దని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామం దాటాలంటే ఏనుగులు, పులులు సంచరిస్తుంటాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అందువల్ల తమ స్కూల్ ను జడ్పీ హైస్కూల్ లో విలీనం చేయొద్దని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement