Friday, March 29, 2024

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి చిరంజీవి శుభాకాంక్షలు

కేంద్ర హోంశాఖ స‌హాయ‌క మంత్రి ప‌ద‌వి నుంచి.. కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్ష‌లు. మ‌న‌దేశ ప్ర‌త్యేక‌త‌లు, యోగ్య‌త‌ల‌ను ప్ర‌పంచానికి చాటి చెప్ప‌డానికి కిష‌న్ రెడ్డికి మంచి అవ‌కాశం ల‌భించింది. మీరు ఇలాగే కృషి చేస్తూ మన భారతీయ చరిత్రాత్మక సంపదను ప్రపంచదేశాలకు పరిచయం చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు చిరు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చిరంజీవి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించగా, ఆ అనుభూతిని, అధికారాన్ని అనుభవించినందుకు థ్రిల్లింగ్‌గా ఉందని చిరంజీవి ట్వీట్ లో తెలిపారు. తాజా విస్తరణతో కేంద్ర మంత్రి మండలి స్వరూపంలో అనేక మార్పులొచ్చాయి. పెద్ద సంఖ్యలో మంత్రులు రావడమే కాకుండా ఇప్పటికే ఉన్న మంత్రులలోనూ కొందరికి శాఖలు మారాయి. విస్తరణకు ముందు మోదీ మంత్రి మండలిలో 53 మంది ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య 77కి చేరింది.

ఇది కూడా చదవండి: మిల్కీ బ్యూటీ డ్యాన్స్ చూస్తే మతి పోవాల్సిందే

Advertisement

తాజా వార్తలు

Advertisement