Saturday, April 20, 2024

కోటి వృక్షార్చ‌న ‌- భూదేవి నుదుటిపై పచ్చటి తిలకందిద్దుదాం… మెగాస్టార్

భూదేవి నుదుటిపై పచ్చటి తిలకందిద్ది హరిత సౌభాగ్యంతో ప్రకాశింపజేయాలనే సత్సంకల్పంతో ఎంపీ సంతోష్‌కమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక గంటలో కోటి మొక్కలు నాటే లక్ష్యంతో కోటి వృక్షార్చనకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కోటి వృక్షార్చ‌న‌లో అంద‌రూ పాల్గొనాల‌ని కోరుతూ వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు… ‘తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలని సీఎం కేసీఆర్‌గారి ఆకాంక్ష. ఆయన ఆశయాన్ని నెరవేరుద్దాం. ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా చేపట్టబోతున్న కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి..సీఎంగారికి జన్మదిన కానుకగా అందిద్దాం. మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని కోరుతున్నా’ అని చిరంజీవి పేర్కొన్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement