Friday, April 19, 2024

చిరంజీవి విలక్షణమైన నటుడు.. తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ

ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డును దక్కించుకున్న దిగ్గజ నటుడు, మెగాస్టార్ చిరంజీవిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ‘‘చిరంజీవి విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ, ఆదరణనూ చూరగొన్నారు’’ అంటూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement