Saturday, April 20, 2024

బాలయ్య టాక్ షోలో చిరంజీవి

నందమూరి బాలకృష్ణ టాక్ షో టాక్ ఆఫ్‌ ద టాలీవుడ్‌గా మారింది. ఆహా ఓటీటీలో ప్రత్యేకమైన టాక్ షోను బాలయ్య చేస్తున్నాడు. ‘అన్ స్టాపబుల్’ వర్కింగ్ టైటిల్ గా రాబోతున్న ఈ టాక్ షోలో అతిథులుగా మహామహులు పాల్గొంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో కూడా బాలయ్య టాక్ షో ఉందట. అందులో చిరుతో పాటు చరణ్ కూడా పాల్గొనబోతున్నట్లు టాక్.

ఇక ఈ టాక్ షో ఆరంభ ఎపిసోడ్‌లో మోహన్ బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మి అతిథులుగా కనిపిస్తారట. తొలి ఎపిసోడ్‌లో మంచు ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేయడానికి బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. అలాగే అక్కినేని నాగార్జున, అతని కుమారులతో బాలకృష్ణ ఇంటర్వ్యూ కు సంబంధించి చర్చలు నడుస్తున్నాయట. ఇక పూరీ జగన్నాథ్, క్రిష్ వంటి దర్శకుల సంగతి సరేసరి. బాలయ్యతో పనిచేసిన దర్శకులు, తారలు కూడా ఈ టాక్ షోలో మెరవనున్నారు. నవంబర్ నెలలో ఈ టాక్ షో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి 8 ఎపిసోడ్స్ ఉంటుందని టాక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement