Thursday, April 18, 2024

హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా బాధ్యతలు చేపట్టిన చింతా ప్రభాకర్

ఉమ్మడి మెదక్ బ్యూరో ( ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సంగారెడ్డి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు,
మాజీ ఎమ్మెల్యే, చింతా ప్రభాకర్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ నారాయణ గూడలోని టెస్కో భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో పదవి స్వీకార మహోత్సవ జరుగగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటానని ఆయన నాపై నమ్మకముంచి అప్పగించిన బాధ్యతలను వమ్ము చేయకుండా నెరవేరుస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సంగారెడ్డి జిల్లా ముఖ్య నేతలు భారీగా హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement