Sunday, March 24, 2024

ఛత్తీస్ గఢ్ లో టెన్షన్..మందుపేతర పేల్చిన మావోలు..

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాల జవాన్లు గల్లంతు కాగా, వారికోసం అదనపు బలగాలు గాలిస్తున్న తరుణంలో మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. నిన్న ఎన్ కౌంటర్ జరిగిన సుక్మా-బిజాపూర్ అటవీప్రాంతంలోనే నేడు మందుపాతర పేలింది. భద్రతా బలగాలే లక్ష్యంగా మావోలు ఈ చర్యకు పాల్పడ్డారు. ఇక నిన్నటి ఎన్ కౌంటర్ లో మృతి చెందిన జవాన్ల సంఖ్య 24కి పెరిగింది. మృతుల్లో 9 మంది కోబ్రా దళాలకు చెందినవారు కాగా, 8 మంది డీఆర్జీ సిబ్బంది, ఆరుగురు ఎస్పీఎఫ్ సిబ్బంది, ఓ బస్తర్ బెటాలియన్ జవాను ఉన్నారు. నక్సల్స్ దాడిలో 31 మంది జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 16 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. తీవ్రంగా గాయపడిన జవాన్లలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. అటు, నక్సల్స్ దాడి ఘటనలో గల్లంతైన జవాన్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ నుంచైనా దాడులు జరిగే అవకాశం ఉండటంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement